11, మార్చి 2011, శుక్రవారం

ఓయి తెలుగువాడా !

విగ్రహాలు ద్వంసం అయ్యాయి .దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ?ఎలా ప్రతిస్పందించాలి ?మొట్ట మొదటగా మనం మనుష్యులం కాబట్టి హింసని ప్రోత్సహించం కాబట్టి ఈ చర్యని ఖండిస్తాం .మనలో కొంత మందిమి భావోద్వేగాలు ఎక్కువగా ఉన్న సమయాల్లో మన సొంత అజెండాలను ప్రచారం కూడా చేసుకొంటాం .కొంత మందిమి కర సేవకుల బాబ్రీ విద్వంసాన్ని ఉటంకించి మన లౌకికత్వాన్ని చాటుకోవడం తో పాటు మా పార్టీ బా జ పా కి వ్యతిరేఖం అని ప్రజలను ఒప్పించాలను కొంటాం.ఇంకొంత మందిమి ఎన్ టి ఆర్ మాత్రమే ఒక్క మగాడు అని చాటి చెప్పా లనుకుంటాం .ఇంకా కొంత మందిమి మనకు తెలిసిన కవితలని ఉటంకించి మన పాండిత్యాన్ని నిరూపించు కోవాలనుకొంటాం . ok it is an occasion to prove our love for the language ,to propagate our ideologies ,to reinforce stereotypes.

భారత దేశం ఒక జాతి గా గడిచిన అరవై సంవత్సరాలుగా మనుగడ సాధించడమే కాకుండా మనమంతా ఒకే జాతి అనే భావన అభివృద్ధి చెందింది కూడా .కొన్ని చిన్న చిన్న అపశ్రుతులు ఉన్నప్పటికీ ఎన్నో కులాలు ,మతాలు ,ప్రాంతాలుగా ఉండిన భారత దేశం ఐక్యంగా మనుగడ సాధించి అభివృద్ధి సాధించడం అద్బుతం .భారత దేశ పాలకులు ఈ దేశంలోని భిన్నత్వాన్ని ఆమోదించి గౌరవించడమే కాకుండా భిన్న సమూహాల ఆశలని ఆకాంక్షలని ప్రతిఫలించే వ్యవస్థలకి అవకాశం కల్పించడం ఈ దేశ సమగ్రతను కాపాడడానికి ఒక ముఖ్య కారణం కావచ్చు .దీన్నే మనం చిన్నప్పుడు unity in diversity అని చదివి వంటబట్టిచ్చుకోన్నాం .

అయితే వివిధ రాష్ట్రాలుగా మనుగడ సాదిస్తున్న భారతదేశం ప్రాంతీయ ఆశలని ఆకాంక్షలని సంతృప్తి పరిచినప్పటికీ ,ఒకే రాష్ట్రంలో ఉన్న భిన్న అస్తిత్వ భావనలకి సరైన ప్రాతినిధ్యం కల్పించ లేక పోయింది .ap విషయంలో ఒక ప్రాంత అస్తిత్వాన్ని విస్మరించడం ,వారి సాంస్కృతిక చిహ్నాలని నిర్లక్ష్యం చేయడం అనే దుర్మార్గం కొంత ఎక్కువగానే జరిగింది .సమ్మక్క ,సారక్క ,కొమరం భీం ,చాకలి ఐలమ్మ ,దొడ్డి కొమరయ్య అందరూ ఎందుకు సరైన ప్రాతినిధ్యానికి నోచుకోలేదు అనేదానికి మనదగ్గర స్పష్టమైన సమాధానాలు లేవు .పొనీ ఇప్పుడైనా దిద్దుబాటు చర్యలేమైన చే పడతామా అంటే ,అదీ లేదు .

నన్నయ్య ,శ్రీ కృష్ణదేవరాయలు ,అన్నమయ్య ,శ్రీ శ్రీ ,జాషువా అందరూ మనం ఎంతో అపరూపంగా మన గుండెల్లో పదిల పరుచుకొన్న మన సాంస్కృతిక నాయకులే .కానీ మనలో కొంత మందిమి వారి విగ్రహాలను చాల అవలలీగా నాశనం చేయగలుగుతున్నామంటే ఎక్కడో ఏదో పెద్ద లోపం ఉందనిపిస్తుంది .అరిచి గోలపెట్టి రాళ్లేసినంత మాత్రాన బెదిరి పోయే వాళ్ళు ఎవరూ లేరు.లగడపాటి ad ఓయి తెలుగువాడా ప్రతి రొజు గంట సేపు వేసినా లాబం లేదు .తెలంగాణా వాళ్ళను ఆంధ్రులు తెలబాన్ అని  అనేస్తే వాళ్ళు  ఆంధ్రులను ఆటవికులు అనెయ్యొచ్చు .ఈ మధ్య కాలంలో నిజాయితిగా ప్రవర్తిస్తున్న అతి కొద్దిమందిలో ఒకరైన కతి పద్మారావు గారు చెప్పిన్నట్టు తెలుగు జాతికి ఉమ్మడి సంస్కృతి ,వారసత్వం ఉన్నాయి .దీన్ని మనం కాపాడుకోవాలి .దానితోపాటే తెలంగాణా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన విభజన జరగాలి .భిన్న ప్రాంతాల ఆశలు ఆకాంక్షలు తీరాలి .తెలుగు జాతి సుఖ సంతోషాలతో వికసించాలి.

కామెంట్‌లు లేవు: